Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో అదరగొట్టిన వార్నర్.. అయినా గెలవలేకపోయిన హైదరాబాద్

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (12:21 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా హైదరాబాగ్ సన్ రైజర్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుపును నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై కేకేఆర్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓ దశలో గెలుపు సాధ్యమని అందరూ భావించినా సన్ రైజర్స్ ఆశలపై నీళ్లు చల్లాడు ఆండ్రీ రసెల్. రసెల్ కేవలం 19 బంతుల్లో 49 పరుగులు చేసి నైట్ రైడర్స్ విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ మూడు వికెట్లకు 181 పరుగులు చేయగా, కేకేఆర్ నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించి గెలుపును కైవసం చేసుకుంది. ఇక ఓపెనర్ నితీశ్ రాణా 47 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. రాబిన్ ఊతప్ప 35 పరుగులు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో రసెల్ ఇన్నింగ్సే హైలైట్ అని చెప్పాలి. 4 ఫోర్లు, 6 సిక్సర్లతో సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 
 
ఇక ఇదే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన సత్తా చాటాడు. బాల్ టాంపరింగ్ కు పాల్పడినట్టు తేలడంతో ఏడాది నిషేధానికి గురైనా ఆ ఛాయలేమీ కనిపించకుండా, తాజాగా ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్ బౌలర్లను ఊచకోత కోశాడు.
 
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్‌లో వార్నర్ కేవలం 53 బంతుల్లో 85 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 9 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ వార్నర్ చలవతో 3 వికెట్లకు 181 పరుగులు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

తర్వాతి కథనం
Show comments